తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తాజాగా నటి శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు పంజాగుట్ట పోలీసులు నోటిసులు పంపించారు. రేపు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి దుబాయ్కి పరారయ్యారు. హీరోయిన్, హీరోలతో పాటు మరి కొంతమందిపై పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం.