ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్కు ఢిల్లీ తీజ్ హజారీ కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను కోర్టు సోమవారం తోసిపుచ్చింది. మే 13న దాడి ఘటనపై స్వాతి మాలీవాల్ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బిభవ్ కుమార్ను అరెస్టు చేయడంతో ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.