అయోధ్యలో బీజేపీ వెనుకంజ
By Sai shivani 52చూసినవారుఅయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టడంతో ఈసారి 400 లోక్సభ స్ధానాలు సాధిస్తామనే నినాదంతో హోరెత్తించిన కాషాయ పార్టీకి స్వయంగా అయోధ్యలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయోధ్య ఫైజాబాద్ లోక్సభ స్దానం పరిధిలో ఉండగా ఈ స్ధానంలో ఎస్పీ అభ్యర్ధి విజయం దిశగా సాగుతున్నారు. బీజేపీ అభ్యర్ధి లల్లూ సింగ్పై ఎస్పీ అభ్యర్ధి అవధేష్ ప్రసాద్ 25,000కుపైగా ఆధిక్యంలో ఉన్నారు.