ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ కొత్త కుట్ర పన్నిందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. యమునా నది నీటిని ఢిల్లీకి రాకుండా అడ్డుకొని, దేశ రాజధానిలో నీటి సంక్షోభాన్ని సృష్టించాలని చూస్తోందని అన్నారు. ఢిల్లీ చరిత్రలో యమునా నది నీటి మట్టం 671 అడుగుల కంటే తగ్గడం ఇదే తొలిసారి అని ఆమె అన్నారు.