దృష్టిలోపం ఉండి న్యాయవాద వృత్తిలోకి రావాలనుకునే వారికి సుప్రీం కోర్టు శుభవార్త చెప్పింది. సుప్రీం కోర్టు సోమవారం అంధుల కోసం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అంధులు కూడా న్యాయ సేవలలో నియమించబడే హక్కు కలిగి ఉంటారని సుప్రీం పేర్కొంది. అంధులు కూడా న్యాయమూర్తులు కావచ్చని కోర్టు వెల్లడించింది. దృష్టి లోపం ఉన్న వ్యక్తులను న్యాయ సేవకు నిరాకరిస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కొట్టివేసింది.