హైదరాబాద్లోని బండ్లగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వెటర్నరీ డాక్టర్ మసియుద్దిన్ను రెండో భార్య షబానా అతికిరాతకంగా హత్య చేసింది. కొడుకుతో కలిసి భర్త కాళ్లు, చేతులు కట్టేసి గొంతు కోసి మరీ ఈ దారుణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.