ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. లఖింపూర్ ఖేరి జిల్లాలో కూరగాయల మార్కెట్లోకి రెండు ఎద్దులు దూసుకురావడంతో ఓ వృద్ధుడు మరణించాడు. అబ్దుల్ వాహిద్ (60) అనే వృద్ధుడు కూరగాయలను విక్రయించేందుకు మార్కెట్కు వచ్చాడు. మార్కెట్లోకి వచ్చిన ఎద్దులు పొట్లాడుకుంటూ వాహిద్ను తొక్కుకుంటూ వెళ్లాయి. దీంతో అతను తీవ్రంగా గాయపడి మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.