తెలంగాణలో త్వరలో ఉపఎన్నికలు రానున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ వేదికగా వెల్లడించారు. మంచిని మైకులో చెబుతామంటే.. ఈ రేవంత్ ప్రభుత్వం చేసిన మంచి ఒక్కటీ కూడా లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కొట్టుకుపోయినవి, కూలిపోయిన వాటిని లెక్కే లేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు ఎవరూ సంతోషంగా లేరని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.