భారత పార్లమెంట్ మధ్యవర్తిత్వ చట్టాన్ని 2023 సంవత్సరంలో ఆమోదించింది. దేశంలో మొదటి మధ్యవర్తిత్వ, సామరస్య సాధన కమిటీ ఏర్పాటుకు ఆదేశించిన ఘనత 2005లో నాటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్సీ లహోటీకి దక్కుతుంది. వివాదం దాఖలైన 120 రోజుల్లో పరిష్కారం కనుక్కోవాలని, వాది ప్రతివాదులు అంగీకరిస్తే పరిష్కార గడువును 180 రోజుల వరకు పొడిగించవచ్చని మధ్యవర్తిత్వ చట్టం పేర్కొంటోంది.