యూపీలోని అయోధ్యలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కొత్వాలి నగర్లోని ఈద్గా సివిల్ లైన్ సమీపంలో కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు.