ఉత్తరాఖండ్లోని సోన్ ప్రయోగ్ నుంచి కేదార్నాథ్ వరకు 12.9 కిలోమీటర్ల పొడవైన రోప్ వే నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జాతీయ ‘రోప్ వే’ల అభివృద్ధి కార్యక్రమంగా దీన్ని చేపట్టబోతున్నారు. దీని వలన 8-9 గంటల పాటు ప్రయాణ సమయం కాస్తా, కేవలం 36 నిమిషాల్లోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టును రూ.4,081.28 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేయనున్నారు.