రామ్ గోపాల్వర్మ అమరావతి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన గతంలో తీసిన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరి పోలీస్ స్టేషన్లలో పలు ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు తాజాగా ఆర్జీవీకి నోటీసులు పంపారు. ఈ క్రమంలో సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ రామ్ గోపాల్వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.