అనంతపురం జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. గుంతకల్లులో కన్న కూతురును తండ్రి హత్య చేశాడు. కూతురు వేరొకరిని ప్రేమించడంతో జీర్ణించుకోలేకపోయిన తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కూతురుని హత్య చేసిన తర్వాత తండ్రి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.