ఢిల్లీ సీఎం, AAP జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం లొంగిపోయారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో తిరిగి తీహార్ జైలుకు వెళ్లిపోయారు. తొలుత తన తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించారు. తర్వాత రాజ్ఘాట్లో మహాత్మ గాంధీకి నివాళులుర్పించారు. ఇదిలా ఉండగా ఆయన అనారోగ్య కారణంలో రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ తీర్పు జూన్ 5న రానుంది.