గ్రేటర్ వరంగల్ అభివృద్ధి పనులపై హనుమకొండ కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. స్మార్ట్సిటీ పథకంలో భాగంగా చేపట్టినవి, ప్రగతిలో ఉన్నవి, చేపట్టాల్సిన పనులపై రివ్యూ చేస్తారని తెలిపారు. వరంగల్ సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ 2050ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ, స్మార్ట్ సిటీ పథకం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంపై పలు సూచనలు చేశారు.