మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసు దోషి.. మున్నా అలియాస్ మహ్మద్ అలీ ఖాన్ ను ఖైదీలు జైలులో హత్య చేశారు. ఐరన్ పైప్తో అతడి తలపై కొట్టి చంపారు. కొల్హాపూర్లోని కలాంబా సెంట్రల్ జైలులో ఈ సంఘటన జరిగింది. 1993 మార్చి 12న ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 257 మంది మరణించగా వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఆదివారం జైలులోని బాత్రూమ్ ప్రాంతంలో స్నానం చేయడంపై అలీ ఖాన్, ఇతర ఖైదీల మధ్య వాగ్వాదం జరిగింది.