చంద్రబాబు కూటమి విజయాన్ని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ కూటమి విజయాన్నే సూచించాయని తెలిపారు. కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థులకు సూచించారు. వైసీపీ అక్రమాలకు పాల్పడవచ్చని హెచ్చరించారు. అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పని చేయాలన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్రూమ్ల నుంచి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యహరించాలని పేర్కొన్నారు.