ప్రకాశం జిల్లా దర్శిలో కౌంటింగ్ నిలిచిపోయింది. 16 రౌండ్లు పూర్తయ్యేసరికి
వైసీపీ ఆధిక్యంలోకి వచ్చింది. దీంతో కౌంటింగ్ నిలిపివేయాలంటూ
టీడీపీ శ్రేణులు పట్టుబట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో దాదాపు గంటన్నర సేపు కౌంటింగ్ను నిలిపివేశారు. మరోవైపు కర్నూలు జిల్లా ఆలూరులో సైతం కౌంటింగ్ నిలిచిపోయింది. వైసీపీకి 2,851 ఓట్ల ఆధిక్యత రావడంతో
టీడీపీ శ్రేణులు రీకౌంటింగ్ జరపాలని డిమాండ్ చేశారు.