బీహార్ మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు మరోసారి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కాంలో లాలుతో పాటు 77 మంది నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు ఇచ్చింది. అలాగే తేజ్ ప్రతాప్ యాదవ్, హేమా యాదవ్లకు కూడా సమన్లు పంపింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన ధృవీకరించే అభియోగాలతో సహా మూడు ఛార్జ్ షీట్లను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.