యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బరేలీ హైవేలోని బినావర్ పీఎస్ ప్రాంతంలో అతివేగంగా వచ్చిన డీసీఎం, బైక్ను ఢీకొట్టింది. ఢీకొన్న తర్వాత డీసీఎం బైక్పై ఉన్న వ్యక్తిని 10 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో యువకుడు అక్కడే మృతిచెందగా, డీసీఎం డ్రైవర్ పరారీ అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.