IPL-2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (72), పూరన్ (75) అర్థశతకాలతో రాణించారు. DC బౌలర్లలో స్టార్క్ 3, కుల్దీప్ 2 వికెట్లు తీయగా విప్రాజ్, ముఖేష్ తలో వికెట్ తీశారు. దీంతో DC లక్ష్యం 210 పరుగులుగా ఉంది.