వేములవాడకు భక్తులు పోటెత్తారు. శ్రీరాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం సోమవారం వేకువజాము నుంచే భారీగా తరలివచ్చారు. తెలంగాణలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది భక్తులు చేరుకున్నారు. రాజన్న దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. కోడె మొక్కుల కోసం క్యూలైన్లో భారీగా భక్తులు వేచి ఉన్నారు.