ఐపీఎల్-2025 మెగా టోర్నీకి సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, స్టార్ మహేంద్ర సింగ్ ధోని తన జట్టుతో చేరాడు. ఈ సందర్భంగా ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను CSK ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడనుంది. మార్చి 23న చెపాక్లో ఈ మ్యాచ్ జరుగనుంది.