అమర్‌నాథ్ యాత్రలో శివుడి నడిచి వెళ్లిన దారేదో తెలుసా?

58చూసినవారు
అమర్‌నాథ్ యాత్రలో శివుడి నడిచి వెళ్లిన దారేదో తెలుసా?
మంచులింగ దర్శనం కోసం అమర్‌నాథ్ యాత్రకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ఇక్కడ గుహమీదుగా జారే నీటి బొట్లు లింగాకారంగా ఏర్పడుతాయి. ఇక క్షేత్రాన్ని చేరుకునేందుకు రెండు మార్గాలున్నాయి. పెహల్గాన్ నుంచి పంచతరణికి వెళ్లి.. 6కి.మీ. దూరంలో ఉండే గుహకి చేరుకుంటారు. ఇది శివుడు నడిచి వెళ్లిన దారని భావిస్తారు. శ్రీనగర్ నుంచి బాల్తాల్‌కు చేరుకుని, అక్కడి నుంచి 14 కి.మీ. దూరంలో ఉన్న గుహకు వెళ్లడంలో మరొక దారి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్