గుజరాత్లోని మోర్బీలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. బాపసీతారాం చౌక్లో తల్లీకుమార్తె స్కూటర్పై వెళ్తున్నారు. ఎదురుగా కంకర లోడ్తో కూడిన డంపర్ లారీ వస్తోంది. దీంతో వారు ఆగిపోయారు. ఆ సమయంలో అకస్మాత్తుగా డంపర్ లారీ ఒరిగిపోయి, స్కూటీపై పడింది. డంపర్లోని కంకర మొత్తం తల్లీకుమార్తె పడింది. వెంటనే స్పందించిన స్థానికులు వారిద్దరినీ కాపాడి ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ వారు ప్రాణాలతో బయటపడ్డారు.