జ‌మ్మూక‌శ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఈసీ క‌స‌ర‌త్తు

64చూసినవారు
జ‌మ్మూక‌శ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఈసీ క‌స‌ర‌త్తు
జమ్మూకశ్మీర్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవ‌ల ముగిసిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో జ‌మ్మూక‌శ్మీర్‌లో 58.58 శాతం పోలింగ్ న‌మోదైంది. ఈ నేపథ్యంలో అక్కడ అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్ ఈ నెల‌లో ప్ర‌క‌ట‌న చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఆగ‌స్ట్ ద్వితీయార్థంలోగా ఎన్నిక‌ల‌ను పూర్తి చేయాల‌ని ఈసీ యోచిస్తోంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పెద్ద‌ ఎత్తున పోలింగ్ నమోదు కావడం సానుకూల సంకేతంగా ఈసీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్