2024 సార్వత్రిక ఎన్నికల విజయావకాశాలపై పలు సర్వే సంస్థలు వెలువరించిన ఎగ్జిట్పోల్స్కు విలువ లేదని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ను రెండు నెలల క్రితమే ‘ఇంట్లో తయారుచేసినవి’గా దీదీ పేర్కొన్నారు. ఇంతకుముందు కూడా ఈ అంచనాలేవీ నిజం కాలేదని విమర్శించారు. ఇండియా కూటమిలో చేరతామని, ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేస్తామని ఆమె తెలిపారు.