హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పాషా కాలనీలో ఘోర అగ్నిప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఓ భవనంలో ఉన్న కిరాణా దుకాణంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో చిన్నారి జమీలా ఖతున్(70), సహనా ఖాతూన్(40), సీజీరా ఖాతున్(7) మృతి చెందారు. మరో ఐదుగురిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. గ్యాస్ సిలిండర్లు పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.