నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపిలింగోటం వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు మొత్తం నుజ్జునుజ్జు అయి కారులోకి ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతులు హైదరాబాద్ అళ్వాల్కు చెందిన సాయి గౌడ్, ప్రవీణ్గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.