ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొడుతున్న కింగ్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో నిలిచాడు. పాకిస్థాన్పై సూపర్ సెంచరీ ఆస్ట్రేలియాపై 84 పరుగులు చేసి టీమిండియా విజయంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లో 217 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే కోహ్లీ మరో 45 పరుగులు చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలువనున్నాడు.