TG: శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో కొంత పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 అనే పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు. గల్లంతైన వారిలో కొందరిని నేడు సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది.