నలుగురు పిల్లలను గొంతు కోసి చంపేసి, తర్వాత తండ్రి రాజీవ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో చోటుచేసుకుంది. అతని భార్య పుట్టింటికి వెళ్లగా, పిల్లలు(13 ఏళ్ల స్మృతి, 9 ఏళ్ల కీర్తి, 7 ఏళ్ల ప్రగతి, 5 ఏళ్ల రిషబ్లు) అతని వద్ద ఉన్నారు. బుధవారం రాత్రి రాజీవ్ పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రించే సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.