నష్టపోయిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: సిపిఎం పార్టీ

752చూసినవారు
నష్టపోయిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: సిపిఎం పార్టీ
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామం లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన రైతుల దగ్గరికి ఆదివారం నాడు సిపిఎం నాయకులు వెళ్ళి పరామర్శించారు. అనంతరం రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగా రైతులు మాట్లాడుతూ.. పంట వేసుకున్న తర్వాత రోజు వర్షం పడి పంట మొత్తం నాశనం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 15 వేల చొప్పున పెట్టుబడి పెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ సాగు చేయాలంటే తమ దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని వాపోయారు. జిల్లా నాయకులు ఎస్ మల్లేష్ హరీష్ నాయక్ మాట్లాడుతూ.. నష్టపోయిన ప్రతి కుటుంబానికి 15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాదాపు 500 ఎకరాలు పంట నష్టం జరిగిందని ప్రభుత్వ అధికారులు వెళ్లి విచారణ చేపట్టి రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్