ఉపాధిహామీ కూలీల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి: హరీష్ నాయక్

1759చూసినవారు
ఉపాధిహామీ కూలీల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి: హరీష్ నాయక్
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కూలీల దగ్గరికి వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా కూలీలు మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా పనిచేస్తున్న ఒక వారం పైసలు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండాకాలంలో ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా పనిచేస్తున్న పైసలు ఇప్పటివరకు మంజూరు చేయలేదని, నిత్యావసర ధరలు పెరగడం పెనుభారంగా మారింది. కానీ కొనడానికి కూడా పైసలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు నాలుగు వందల కుటుంబాలు ఉపాధి హామీ కార్యక్రమంలో పని చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క వారం పైసలు రాలేదని చెప్పారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి కూలీలకు, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కశ్న భీమ్లా, శ్రీశైలం, జంగమ్మ, తిరుపతమ్మ, లింగమ్మ, అలివేల చిట్టి, సక్రి దేవి, హనుమంతు తదితరులు, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్