భారత ప్రధాన కోచ్ పదవికి మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అత్యుత్తమ ఎంపిక అని పాక్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ పేర్కొన్నాడు. గంభీర్ స్పష్టవాదిగా, తెలివైనవాడిగా ఉంటాడని, జట్టులోకి దూకుడును తీసుకొస్తాడని అభిప్రాయపడ్డాడు. కోల్కతాను ఐపీఎల్ ఫైనల్కు చేర్చడంలో గంభీర్ కీలకపాత్ర పోషించాడని ప్రశంసించాడు. ఒకవేళ టీమిండియా కోచ్గా వస్తే జట్టులోకి దూకుడును తీసుకొస్తాడనంలో సందేహం లేదని అక్రమ్ స్పష్టం చేశాడు.