ఏపీలో రూ.3.6 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

82చూసినవారు
ఏపీలో రూ.3.6 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
ఏపీలోని కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్నికల స్క్వాడ్ నిర్వహించిన తనిఖీల్లో రూ 3.6 కోట్ల విలువైన బంగారం పట్టుబడింది. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఎన్.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి కాకినాడలోని పలు నగల దుకాణాలకు అనుమతి పత్రాలు లేకుండా బంగారాన్ని తరలిస్తుండగా గుర్తించి సీజ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్