కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్దారులకు గుడ్న్యూస్ చెప్పింది. ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం. వచ్చే నెలలో షరతులు, నిబంధనలను క్యాబినెట్ ఆమోదం కోసం పంపనుందని తెలుస్తోంది. ఆ తర్వాత అధికారిక నోటిఫికేషన్తో కమిషన్ పని ఆరంభిస్తుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖలు నుంచి సూచనలు వచ్చాయి. దీంతో 50లక్షలకు పైగా ఉద్యోగులు, పింఛన్దారులకు ప్రయోజనం చేకూరుతోంది.