హైదరాబాద్ లోని హిమాయత్నగర్లోని శ్రీ బాలాజీ భవన్లో టీటీడీ ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి 19వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. హనుమంత వాహనంపై స్వామివారికి ఊరేగింపు జరిపారు. ఈ ఆనంద సమయాన భక్తులు, మహిళల కోలాటాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి.