ఎన్నిక టైంలో హనుమాన్ చాలీసా (వీడియో)

11834చూసినవారు
ఢిల్లీలో హోరాహోరీగా జరిగిన మేయర్ ఎన్నికలో ఆప్ విజయం సాధించగా, ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక విషయంలో జాప్యానికి నిరసనగా బీజేపీ కౌన్సిలర్లు ‘హనుమాన్ చాలీసా’ పఠించారు. సభలో ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.