రిషభ్‌ పంత్‌కు భారీ జరిమానా

69చూసినవారు
రిషభ్‌ పంత్‌కు భారీ జరిమానా
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్‌ పంత్‌పై ఒక మ్యాచ్‌ వేటు పడింది. ఈ మేరకు ఐపీఎల్‌ గవర్నింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు పంత్‌కు రూ.30 లక్షల జరిమానా విధించింది. మే 7న రాజస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఢిల్లీ ఐపీఎల్ కోడ్‌ ఆఫ్‌ కండక్డ్‌ను ఉల్లంఘించినట్టు పేర్కొంది. స్లో ఓవర్ రేట్‌ కారణంగా పంత్‌కి రూ.30 లక్షలు, జట్టులోని మిగతా సభ్యులు రూ.12 లక్షలు లేదా మ్యాచ్‌ ఫీజ్‌లో 50 శాతం.. వీటిల్లో ఏది తక్కువైతే దానిని ఫైన్‌గా కట్టాలి.

సంబంధిత పోస్ట్