హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాన్ని ఆకస్మిక వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కులూ జిల్లాలో గడిచిన 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైందని రాష్ట్ర వాతావరణ విభాగం వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యవస్థమైంది. మరీ ముఖ్యంగా, కొండ ప్రాంతాల్లో జనాలు చిక్కుకుపోతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం విద్యుత్తు, తాగునీరు ఇతర సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి.