తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన ఘటనకు సంబంధించి 2020 మార్చిలో నార్సింగి పీఎస్లో ఆయనపై కేసును బుధవారం హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో CMని నార్సింగి పోలీసులు రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. FIRను క్వాష్ చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనల విన్న కోర్టు.. నిషిద్ధ ప్రాంతమేమీ కాదని, రేవంత్పై తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని తెలిపింది.