ప్రారంభమైన కేబినెట్ సమావేశం

559చూసినవారు
హైదరాబాద్ లోని డా. బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ఆదివారం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఈ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీల ఖరారు, మరో రెండు గ్యాంరెంటీల అమలుపై చర్చిస్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి రేపు రాంచీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ న్యాయ యాత్రలో పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్