సీఎం రేవంత్ తో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ
సీఎం రేవంత్ రెడ్డితో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావ్ పటేల్, పైడి రాకేష్ రెడ్డి శనివారం హైదరాబాద్లోని సచివాలయానికి వెళ్లి సీఎంను కలిశారు. ఈ సందర్భంగా రైతు సమస్యలు, పంట కొనుగోలుపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ నియోజకవర్గంలోని పలు సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రేవంత్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యేలు తెలిపారు.