ఫోన్ టాపింగ్ కీలక నిందితుడు రాష్ట్రంలో సంచలన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-4గా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణన్ కరీంనగర్ కు వచ్చారు. నగరంలోని సాగర్ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లిని చూసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును విన్నవించగా కోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాదులోని చెంచల్ గూడ జైలు సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం కరీంనగర్ కు తీసుకువచ్చారు.