సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్

77చూసినవారు
గడ్డి అన్నారం డివిజన్ లోని కోదండరాం నగర్ కాలనీలో సీసీ రోడ్డు పనులకు జిహెచ్ఎంసి ద్వారా మంజూరైన నిధులతో కార్పోరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. సీసీ రోడ్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. కాలనీ వాసులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా పనులను పూర్తి చేయాలని అధికారులకు వారు సూచించారు.

సంబంధిత పోస్ట్