బడంగ్ పెట్ ప్రాంతానికి చెందిన సాయి కుమార్(22) సోదరి వివాహం కోసం పెదనాన్న కొడుకు మహేష్ కుమార్ అనే కానిస్టేబుల్ వద్ద 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. మహేష్ మొత్తం సొమ్ము కావాలని కొంత కాలంగా అడుగుతున్నాడు. ఈ క్రమంలో మాట్లాడుకుందామని తన తండ్రి ఇంటికి తీసుకెళ్లాడు. వాగ్వాదం జరగగా రెచ్చిపోయిన కానిస్టేబుల్, అతని తండ్రి, సోదరుడు సాయి కుమార్ పై దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.