కాంగ్రెస్, బిజెపి ప్రజలకు చేసిందేమీ లేదు :రాగిడి రజిని

51చూసినవారు
కాంగ్రెస్, బిజెపి ప్రజలకు చేసిందేమీ లేదు :రాగిడి రజిని
మల్కాజిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు మల్కాజ్ గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రాగిడి రజిని ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయలేదని ప్రజలకు వివరిస్తూ, మోసం చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని, బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిత్యవసర సరుకులు, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల బ్రతుకులపై గుది బండగా మారిందని, మత రాజకీయాలు చేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పా ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని అన్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటూ, కాపాడుకుంటూ వచ్చిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అని తెలియచేశారు.

సంబంధిత పోస్ట్