ఆమ్ ఆద్మీ పార్టీ నేతల నిరాహార దీక్ష

600చూసినవారు
అరవింద్ కేజ్రివాల్ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ అధ్వర్యంలో ఆదివారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఎదుర్కొనే దమ్ము లేక ఎన్నికల ముందు బీజేపీ అరెస్ట్ చేసిందని విమర్శించారు. మోడీ చేస్తున్న అనైతిక పనులు ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో బిజెపికి గట్టి బుద్ది చెబుతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్