కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన మహిళ కాంగ్రెస్ నేతలు

81చూసినవారు
గతంలో కేటీఆర్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ చేస్తున్నారని మండిపడుతూ గురువారం మహిళ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. నాంపల్లి చౌరస్తాలో టీపీసీసీ మహిళ అధ్యక్షురాలు సునిత రావు, బషీర్ బాగ్ చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు కలిసి రోడ్డుపై కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేటీఆర్ ఫోటోలను. దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్